News February 12, 2025

తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా, డివిజన్ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలను ముందస్తు ప్రణాళికలతో గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

Similar News

News March 2, 2026

రష్యా చమురు వైపు మళ్లీ భారత్ చూపు

image

హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఆటంకం కలుగుతోంది. దీంతో రష్యా చమురు దిగుమతిపై భారత్ మళ్లీ దృష్టి సారించినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ‘తన జలాల్లో డాక్ చేసిన కార్గోషిప్‌లలోని రష్యా చమురు కొనుగోలుకు భారత్ ఆలోచన చేస్తోంది. ఈ ట్యాంకర్లలో 9.5M బ్యారెళ్ల చమురు ఉంది. భారత ఆయిల్ కంపెనీలు దీనిపై ప్రభుత్వంతో చర్చించాయి’ అని తెలిపింది. US ఒత్తిడితో రష్యా చమురు కొనుగోలును భారత్ తగ్గించడం తెలిసిందే.

News March 2, 2026

రేపు కోటప్పకొండ దేవాలయం మూసివేత

image

చంద్రగ్రహణం కారణంగా ఈనెల 3న కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. గ్రహణం ముగిశాక ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులను తిరిగి అనుమతిస్తామని వెల్లడించారు. భక్తులు ఈ సమయ మార్పును గమనించాలని ఆలయ వర్గాలు కోరాయి.

News March 2, 2026

నరసరావుపేట: పోలీస్ గ్రీవెన్స్‌కి 92 ఫిర్యాదులు

image

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ బి.కృష్ణారావు పాల్గొన్నారు.
ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలోనే పరిష్కారం అందించేలాచర్యలుతీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించినవి 92 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులుకు రిఫర్ చేశారు.