News February 13, 2025
జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వీసీని కలిసిన TCS అధికారులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362262544_51349305-normal-WIFI.webp)
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బుధవారం ఇన్ఛార్జ్ వీసీ సుదర్శన రావును TCS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ‘Corporate Social responsibility’ కింద యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంల గురించి ఇన్ఛార్జ్ వీసీతో కలిసి చర్చించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్: ఆలూరు సాంబ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363550877_51349305-normal-WIFI.webp)
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సీనియర్ నేత ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని ప్రజలు నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.
News February 13, 2025
‘99.97 పర్సంటేజ్తో శింగనమల విద్యార్థి సత్తా చాటాడు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739367219610_51570700-normal-WIFI.webp)
శింగనమల మండలం బండమీద పల్లికి చెందిన శెట్టిపల్లి శశిధర్ రెడ్డి జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ప్రతిభ చూపారు. 99.97 పర్సంటేజ్తో సాధించారు. 1వ తరగతి నుంచి వరకు 10వ తరగతి వరకు అనంతపురం నారాయణ స్కూల్లో చదివారు. ఇంటర్ హైదరాబాద్లో చదువుతున్నాడు. ప్రతిభ చూపిన విద్యార్థిని గ్రామస్థులు, తల్లితండ్రలు అభినందించారు.
News February 12, 2025
‘ఉద్యాన పంటల సాగు పెంపునకు కృషి చేయాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365612113_51570700-normal-WIFI.webp)
అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.