News February 13, 2025
VKB: చిరుత ఉందని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363103360_60402727-normal-WIFI.webp)
వికారాబాద్ నుంచి తాండూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై వెళ్లే మార్గంలో రోడ్డుపై అధికారులు అడవిలో చిరుత ఉందని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం వికారాబాద్ అనంతగిరి అడవిలోనిదే అని డీఎఫ్వో జ్ఞానేశ్వర్ ధ్రువీకరించారు. అయితే చిరుత పాదముద్రలు మాత్రం లభించలేదని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాలకు, అడవులకు ఒంటరిగా వెళ్లకూడదని డీఎఫ్వో సూచించారు.
Similar News
News February 13, 2025
HYD: పాఠాలు చెబుతూ.. అనుకున్నది సాధించా: SI
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739420321429_1212-normal-WIFI.webp)
మొయినాబాద్ SI (ప్రొబేషన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు. పాఠాలు చెబుతూ పేదరికం అనే అడ్డు గోడలను దాటి అనుకున్నది సాధించారు. ‘నా విజయం.. నా స్నేహితులు వారి సహకారం, ప్రోత్సాహంతో సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఆమె చెల్లెలు కూడా కానిస్టేబుల్గా ఎంపికయ్యారని వివరించారు.
News February 13, 2025
పల్నాడు: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్, గుడ్ల ధరలపై ప్రభావం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739423362802_934-normal-WIFI.webp)
గోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి వదంతులతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ ఫ్లూ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఎక్కడా లేదని, వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా జిల్లాలో చికెన్ ధరలు రూ.50 వరకు తగ్గడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు గుడ్డు ధర కూడా రూ.4.50కి దిగివచ్చింది. మీ ఏరియాలో ధరలెలా ఉన్నాయి.
News February 13, 2025
కోడి పందేలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739422765478_1226-normal-WIFI.webp)
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్కు చెందిన మొయినాబాద్ ఫామ్హౌస్లో కోడి పందేలు కలకలం రేపాయి. ఈ క్రమంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ నిర్వహణపై ఆయనను విచారించనున్నారు.