News February 13, 2025
KMR: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ ఔట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373102544_50093551-normal-WIFI.webp)
నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రామలింగంను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఓబీసీ విభాగం ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 13, 2025
సిద్దిపేట: వ్యక్తి పై నుంచి వెళ్లిన కంటైనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739407883067_52021735-normal-WIFI.webp)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వర్గల్ మండలం తునికి మక్తా గ్రామానికి చెందిన స్వామి(45)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.
News February 13, 2025
అనంతగిరిలో చిరుత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739414406904_51639231-normal-WIFI.webp)
అనంతగిరి అడవిలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. అనంతగిరిలో పలుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ ఆదేశానుసారం చిరుత సంచరిస్తుందని అనుమానం ఉన్న ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ అరుణా తెలిపారు. ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని ఆమె సూచించారు. పులిసంచారం ఎక్కడున్నా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News February 13, 2025
పెద్దగట్టు జాతరకు సెలవు ప్రకటించాలని వినతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739424522884_1072-normal-WIFI.webp)
సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి వారి జాతర సందర్భంగా సోమవారం జిల్లాలోని విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఒకరోజు సెలవు ప్రకటించాలని యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పరమేశ్ యాదవ్, నేతలతో కలిసి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని వారు కోరారు.