News February 13, 2025

MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తుతెలియని రైలు కింద పడి అటకపురం రాజలింగు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నూరు మండలంలోని అక్కెపల్లి గ్రామానికి చెందిన మృతుడు కుమ్మరి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ వెల్లడించారు.

Similar News

News November 13, 2025

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

image

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పలు రికార్డులను, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్‌మెంట్ మొదలగు అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులతో మాట్లాడి ఫిర్యాదులను త్వరితగతిన పరిశీలించాలని ఎస్సైని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట పటిష్టమైన నిఘా ఉంచి భద్రత పర్యవేక్షించాలన్నారు.

News November 13, 2025

రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచన: CM

image

రాష్ట్రంలో రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుందని CMచంద్రబాబు రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హాతో చర్చించారు. సోలార్ ప్యానెల్స్ ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తామని CM వెల్లడించారు.

News November 13, 2025

VJA: 4 రోజులుగా CT స్కాన్ సేవలు బంద్.. రోగుల అవస్థలు.!

image

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో గత నాలుగు రోజులుగా సీటీ స్కాన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేట్, ప్రభుత్వ సీటీ స్కాన్ పరికరాలు ఒకేసారి పాడైపోవడమే దీనికి కారణం. రోజుకు 200 నుంచి 300 వరకు స్కాన్లు జరిగేవి. ప్రస్తుతం రోగులను అంబులెన్స్‌లో బయట కేంద్రాలకు తరలించి స్కాన్లు చేయిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.