News February 13, 2025
‘ద్రౌపది దాహం తీర్చుకున్న ప్రదేశమే భీముని కొలను’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350784980_672-normal-WIFI.webp)
పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తూ ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా నీళ్లు దొరకలేదు. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పాడు. గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు కిందికి దూకాయి. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చింది.
Similar News
News February 13, 2025
కుంభమేళాలో చాయ్వాలా ఆదాయం తెలిస్తే షాక్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739430325570_653-normal-WIFI.webp)
కోట్లమంది రాకతో మహా కుంభమేళా వద్ద తిండి పదార్థాలు, టీలు, కాఫీలు, వాటర్ బాటిళ్లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. అక్కడ టీ, కాఫీ అమ్ముతూ ఓ చాయ్వాలా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. అతడి సంపాదన నిత్యం రూ.7000. అందులో రూ.2000 ఖర్చులు పోను రూ.5000 మిగులుతున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. అంటే కుంభమేళా జరిగే నెలరోజుల్లో అతడి ఆదాయం రూ.1.50లక్షలకు పైనేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News February 13, 2025
లోక్సభ ముందుకు కొత్త IT బిల్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720723755-normal-WIFI.webp)
లోక్సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్సభను వాయిదా వేశారు.
News February 13, 2025
వైసీపీని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర: జూపూడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739436476678_1226-normal-WIFI.webp)
AP: కూటమి ప్రభుత్వం చట్టాలు తెలియకుండా ప్రవర్తిస్తోందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు దుయ్యబట్టారు. వైసీపీ కేడర్ను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోందని అన్నారు. గన్నవరం దాడి విషయంలో 94 మందిపై కేసులు పెట్టారన్నారు. కోర్టులో కేసులు నడుస్తుంటే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సత్యవర్ధన్ నిజం చెబితే పోలీసుల చేత వేధించి కేసులు పెట్టించారని విమర్శించారు.