News March 20, 2024
గుడ్లూరు: ట్రాక్టర్ను ఢీకొని యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710902129448-normal-WIFI.webp)
ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన గుడ్లూరు మండలంలోని రాళ్లవాగు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పొట్లూరు గ్రామానికి చెందిన ముసలయ్య, చలంచర్ల రమణయ్యలు బైక్ పై గుడ్లూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆగిన ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టారు. ఈప్రమాదంలో ముసలయ్య(29) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News July 5, 2024
చీమకుర్తి : నూడుల్స్ తింటూ వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720159790603-normal-WIFI.webp)
చీమకుర్తిలోని ఓ రెస్టారెంటులో గురువారం రాత్రి నాగశేషులు అనే వ్యక్తి మృతి చెందాడు. రాత్రి 9 గంటల సమయంలో నాగశేషులు పట్టణంలోని ఓ రెస్టారెంట్కి వచ్చి నూడుల్స్ ఆర్డర్ చేసి కొంత వరకు తిన్నాడు. తింటుండగానే కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం ఆత్మకూరుగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2024
పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720161008555-normal-WIFI.webp)
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 5, 2024
ప్రకాశం: పెంపుడు కుక్కలు ఉంటే ఇలా చేయండి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720128281415-normal-WIFI.webp)
రేబిస్ వ్యాధినుంచి నివారణకు పెంపుడు కుక్కల యజమానులు తప్పనిసరిగా తమ కుక్కలకు రాబిస్ వాక్సిన్ చేయించుకోవాలని జిల్లాపశు సంవర్ధక శాఖ అధికారి బేబిరాణి అన్నారు. జునోసిస్ డే సందర్భంగా స్థానిక సంతపేట పశువైద్యశాలలో 6వ తేదీన అన్ని పెంపుడు కుక్కలకు ఈ రేబిస్ టీకాను ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం వరకు ఉచితంగా అందజేస్తామని అన్నారు. కావున ఈ అవకాశాన్ని జిల్లాలోని అందరూ వినియోగించుకోవాలని కోరారు.