News March 20, 2024
ఘోర ప్రమాదం.. 14 మంది మృతి

ఉత్తర చైనాలోని ఓ ఎక్స్ప్రెస్ వే టన్నెల్లో బస్సు ప్రమాదానికి గురై 14 మంది ప్రాణాలు కోల్పోగా 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పి టన్నెల్ గోడకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఈ ఘటనపై అధికారులు నేడు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Similar News
News September 9, 2025
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే..

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటితో పాటు కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ వంటి పానీయాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ‘కొబ్బరి నీళ్లలోని పొటాషియం, ఎలక్ట్రోలైట్లు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. బార్లీ వాటర్ కిడ్నీ స్టోన్స్ను నివారిస్తుంది. గ్రీన్ టీ, క్రాన్బెర్రీ జ్యూస్ కిడ్నీలకు మేలు చేస్తాయి’ అని చెబుతున్నారు.
News September 9, 2025
పాక్ను తేలికగా తీసుకోం: భారత బౌలింగ్ కోచ్

ఆసియా కప్లో పాకిస్థాన్ను తేలికగా తీసుకోబోమని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. పాక్తో సవాలు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని, ఆ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. తమ నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతామన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్/బౌలింగ్ చేసేలా ఆల్రౌండర్లకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాగా భారత్, పాక్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది.
News September 9, 2025
నేపాల్లో సోషల్ మీడియా యాప్లపై నిషేదం ఎత్తివేత

సోషల్ మీడియా యాప్లపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా యాప్ల నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో 19 మంది మరణించగా, 250 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.