News February 13, 2025
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. తీవ్ర ఉత్కంఠ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వంశీని విజయవాడ తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News September 14, 2025
కరీంనగర్: 6 నెలలుగా జీతాలు ఇవ్వట్లే..!

ఉమ్మడి KNR జిల్లాలో పనిచేస్తున్న 11 వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా, సమయానికి వేతనం చెల్లించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై CM రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని, జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
News September 14, 2025
మల్టీపర్పస్ పార్క్ లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం

KNR ప్రజలకు ఆహ్లాదం కోసం రూ.11 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్ ఇప్పుడు వ్యాపార కేంద్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఎంట్రీ ఫీజు ₹20కి బదులు ₹50 వసూలు చేస్తున్నారు. అలాగే పిల్లల ఆటలకు, ఫుట్పాత్పై పార్కింగ్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పార్క్ను కమర్షియల్ పార్క్గా మార్చారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
News September 14, 2025
IOCLలో 523 అప్రెంటిస్లు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(<