News March 20, 2024

యలమంచిలి: ట్రాక్టర్‌ని ఢీకొన్న బస్సు.. వ్యక్తి మృతి

image

యలమంచిలి మండలం పులపర్తి హైవే జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం వొమ్మవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షేక్ మీరా సాహెబ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు.

Similar News

News April 18, 2025

అవిశ్వాసం: విశాఖలో జనసేన నేతల సమావేశం

image

జీవీఎంసీ మేయర్‌పై శనివారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విశాఖలోని ఓ హోటల్‌లో జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం అయ్యారు. రేపు అవిశ్వాసంలో చేపట్టవలసిన తీరుపై ఎమ్మెల్యే వంశీకృష్ణ దిశానిద్దేశం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవిశ్వాసంలో వ్యవహరించాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసంలో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

News April 18, 2025

విశాఖలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

image

విశాఖ సిటీ పరిధిలో దొంగతనానికి గురైన 9బైక్‌లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కోరాపుట్‌కి చెందిన అంతర్రాష్ట్ర దొంగలు కార్తీక్ కిల్లో, బాబుల సుపియాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల్లో రాయల్ ఎన్ ఫీల్డ్, యమహా, తదితర వాహనాలు ఉన్నాయి.

News April 18, 2025

వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడింది: విశాఖ ఎంపీ

image

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విశాఖలో 33 ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, రుషికొండ ప్యాలెస్‌కు రూ.450కోట్లు YCPప్రభుత్వం ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ, విశాఖలో TCSకు ప్రతిపాదనలు చేశామన్నారు.

error: Content is protected !!