News February 13, 2025
ఏలూరు : విద్యార్థులతో టీచర్ అసభ్య ప్రవర్తన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739420697941_1091-normal-WIFI.webp)
ఏలూరు రూరల్ మండలంలోని సత్రంపాడు జెడ్పీ హైస్కూలులో సోషల్ స్డడీస్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో వెంకటలక్ష్మి బుధవారం రాత్రి తెలిపారు. ఇటీవల గుడ్ టచ్- బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అభయ మహిళా రక్షక బృందం అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు వారికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి టీచర్ సాల్మన్ రాజును సస్పెండ్ చేస్తామన్నారు. కాగా ఆయన మరో ఏడాదిలో రిటైర్ అవ్వనున్నారు.
Similar News
News February 13, 2025
ఉంగుటూరులో బర్డ్ ఫ్లూ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739416259514_1091-normal-WIFI.webp)
బర్డ్ ఫ్లూపై ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి కీలక ప్రకటన చేశారు. ఉంగుటూరు(M) బాదంపూడిలోని ఓ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణైనట్లు తెలిపారు. దీంతో బాదంపూడి పౌల్ట్రీ నుంచి కిలీమీటురు పరిధి వరకు రెడ్ జోన్, పది. కి.మీ పరిధిని సర్వేసెన్స్ జోన్ గా ప్రకటించినట్లు తెలిపారు.
News February 13, 2025
ప.గో : కోళ్ల నుంచి కుక్కలకు.. మనుషులకు సోకే ఛాన్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739409015613_1091-normal-WIFI.webp)
ఉమ్మడి ప.గో జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇదే క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో కుక్కలు కూడా చర్మవ్యాధులతో దర్శనమిస్తున్నాయి. అయితే కోడి వ్యర్థాలు తినడం వలనే కుక్కలు ఈ విధంగా బాధపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గాలి ద్వారా ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
News February 13, 2025
‘గూడెం’లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739376828171_51988413-normal-WIFI.webp)
తాడేపల్లిగూడెం పట్టణం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న కియా కారు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైనట్లు అగ్నిమాపక దళాధికారి జీవీ రామారావు బుధవారం తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు అదుపు చేసినట్లు వివరించారు. కారు విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందన్నారు. ఫైర్ సిబ్బంది కే. శ్రీశైలం, గురుప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.