News February 13, 2025
గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739418455884_15795120-normal-WIFI.webp)
RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.
Similar News
News February 13, 2025
తెలంగాణపై వివక్ష లేదు: నిర్మలా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739453251277_81-normal-WIFI.webp)
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న కాంగ్రెస్ MPల ఆరోపణలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, జహీరాబాద్లో ఇండస్ట్రియల్ నోడ్ మంజూరు చేశాం. 2014 నుంచి TGలో 2605K.Mల హైవేలు నిర్మించాం. ఈ ఏడాది రైల్వేలో రూ.5337 కోట్లు కేటాయించాం. 5 వందేభారత్ రైళ్లు మంజూరు చేశాం. 2 లక్షల ఇళ్లు, 31 లక్షల మరుగుదొడ్లు, 38 లక్షల నల్లా కనెక్షన్లు అందించాం’ అని చెప్పారు.
News February 13, 2025
యాదాద్రి: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739453855609_691-normal-WIFI.webp)
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
News February 13, 2025
SRPT: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739453731245_691-normal-WIFI.webp)
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.