News February 13, 2025

వరంగల్: తగ్గిన మక్కల ధర.. పల్లికాయ ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కల ధర మళ్లీ తగ్గింది. మంగళవారం రూ.2,370 పలికిన మక్కలు(బిల్టీ) ధర బుధవారం మరింత తగ్గి రూ.2,355కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,350కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే.. క్వింటా సూక పల్లికాయ ధర రూ.6,410 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.4,900 పలికిందని పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

సిరిసిల్ల: నిస్వార్థ నాయకుడు అమృతలాల్ శుక్లా

image

అమృతలాల్ శుక్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తొలుత ఉపాధ్యాయ వృత్తిని వదిలి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడారు. సామాన్య ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడారు. పేదల కోసం భూ పంపిణీ ఉద్యమాలు, వెట్టిచాకిరి నిర్మూలన కోసం కృషి చేశారు. ఆయన ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారు. 1957లో సిరిసిల్ల MLA గా అమృతలాల్ ఎన్నికయ్యారు.

News September 17, 2025

తుంగతుర్తి: తెగువ చూపి విప్లవాన్ని రగిల్చారు..

image

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దళ నాయకుడిగా పనిచేసి తెగువతో విప్లవాన్ని రగిలించిన నేత భీంరెడ్డి నర్సింహారెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, సామాజిక న్యాయం కోసం, పేదల బతుకులు బాగు చేసేందుకు ఆయన పోరాడారు. ఆకలిదప్పులు, అసమానతలులేని సమసమాజం నిర్మించాలని పరితపించేవారు. మచ్చలేని పార్లమెంట్ సభ్యుడిగా గడిపిన ఆయన జీవితం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.

News September 17, 2025

HYD: దక్కన్ రేడియోలో నిజాం ఏం చెప్పారంటే?

image

‘నా ప్రియమైన ప్రజలారా హమ్ నే భారత్‌కే సదర్ గవర్నర్ జనరల్ రాజగోపాల చారి గారికి పంపుతున్న సందేశం ఏమిటంటే.. నా రాజీనామా సమర్పించడంతోపాటు రజాకారులను నిషేధించమని కోరుతూ HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇకనుంచి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేద భావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించాలని కోరుతున్నా’ అని ప్రసంగించారు.