News February 13, 2025
NRPT: ఎంపికైన కొబ్బరి పూల కుండీల ప్రాజెక్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439718164_51771152-normal-WIFI.webp)
పర్యావరణ అనుకూలతకు తోటకు ఉపయోగించే సామాగ్రి, బయో డీగ్రేడబుల్ కొబ్బరి పూల కుండీలను TSWRS బాలుర దామరగిద్ద పాఠశాలకు చెందిన విద్యార్థి శివారెడ్డి తయారు చేశాడు. ఈ ప్రాజెక్టు జపాన్ సకురా ప్రోగ్రాంకు ఎంపికైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన 11వ జాతీయ స్థాయి ప్రదర్శన INSPIR-MANAK పోటీల్లో పాల్గొని ఘనత సాధించినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. రాష్ట్రం నుంచి 4 ఎంపికైవ వాటిలో ఇది ఒకటి అన్నారు.
Similar News
News February 13, 2025
పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737944091889_1045-normal-WIFI.webp)
AP: తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని CM చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు, RTCలకు కేటాయించేవారు. వీటిని బ్లాక్లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో TTD రద్దు చేసింది. ఇప్పుడు పూర్తిగా AP పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది.
News February 13, 2025
వికారాబాద్: మరోసారి కనిపించిన చిరుత (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739460113467_60402727-normal-WIFI.webp)
వికారాబాద్ అనంతగిరి అడవుల్లో కనిపించిన చిరుత మదనపల్లి బీరోల్ గ్రామ సరిహద్దుల్లో మరోసారి కంటపడింది. బీరోల్ గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ అటుగా వెళుతుండగా చిరుత రోడ్డు దాటుతూ కనిపించిందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత జాడ కోసం సెక్షన్ ఆఫీసర్ అరుణ అన్వేషిస్తున్నారు.
News February 13, 2025
19న BRS విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని KCR ఆదేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739443387043_51703636-normal-WIFI.webp)
19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కేసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్౨ను ఆదేశించారు. సమావేశానికి కావలసిన ఏర్పాట్లను హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయాలని కెసిఆర్ సూచించారు.19న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు.