News February 13, 2025
భార్య వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739441956605_695-normal-WIFI.webp)
భార్యల వేధింపులతో భర్తలు <<15216504>>బలవన్మరణానికి<<>> పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభివన్ సింగ్ బెంగళూరులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఆమె కుటుంబీకులు చేసిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 13, 2025
ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు: విష్ణు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739438307785_695-normal-WIFI.webp)
‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.
News February 13, 2025
BREAKING: తోటి సిబ్బందిపై CRPF జవాన్ ఘాతుకం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908589618-normal-WIFI.webp)
మణిపుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ అనే CRPF జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు చనిపోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తనను తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
News February 13, 2025
సికింద్రాబాద్.. ఈ భవనాలు ఇక కనిపించవు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739459175969_81-normal-WIFI.webp)
సికింద్రాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చే భవనాలు ఇవి. ఎన్నో ఏళ్లుగా ప్రయాణికుల గుండెల్లో, సినిమాల్లో కనిపించిన ఈ రైల్వే స్టేషన్ భవనాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఎన్నో ప్రయాణాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా వీటి స్థానంలో ₹700crతో ఎయిర్పోర్టులా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పాత భవనాలను గుర్తు చేసుకుంటూ ప్రయాణికులు ఎమోషనల్ అవుతున్నారు.