News February 13, 2025

చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

image

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Similar News

News September 16, 2025

మళ్లీ భూముల వేలం.. ఎకరాకు రూ.101 కోట్లు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. HYD ఐటీ కారిడార్‌ సమీపంలోని రాయదుర్గంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమికి అక్టోబర్ 6న ఈ-వేలం నిర్వహించనుంది. OCT 1 వరకు బిడ్ల దాఖలుకు అవకాశమిచ్చింది. రూ.2వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎకరాకు కనీస ధరను ఏకంగా రూ.101 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

News September 16, 2025

డిసెంబ‌రు క‌ల్లా గుంత‌ల ర‌హిత రోడ్లు: కృష్ణబాబు

image

AP: రాష్ట్రంలో 19వేల కి.మీ. రోడ్ల‌ను రూ.860 కోట్లతో గుంత‌ల ర‌హితంగా మార్చినట్లు రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ‘ఈ డిసెంబ‌రుక‌ల్లా ర‌హ‌దారుల‌ను గుంత‌ల ర‌హితంగా మార్చాల‌న్న‌దే ల‌క్ష్యం. మ‌రో 5946 కి.మీ. రోడ్ల‌ మరమ్మతులకు రూ.500 కోట్లు మంజూరు చేశాం. 8744 కి.మీ. జాతీయ‌ ర‌హ‌దారుల‌నూ బాగుచేశాం. PPP మోడ్‌లో 12,653 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయ‌నున్నాం’ అని తెలిపారు.

News September 16, 2025

సెప్టెంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

✒ 1916: ప్రముఖ గాయని MS సుబ్బలక్ష్మి(ఫొటోలో) జననం
✒ 1923: సింగపూర్ జాతి పిత లీ క్వాన్‌ యూ జననం
✒ 1945: కాంగ్రెస్ నేత పి.చిదంబరం జననం
✒ 1959: ప్రముఖ నటి రోజా రమణి జననం
✒ 1975: నటి మీనా జననం
✒ 2012: హాస్య నటుడు సుత్తివేలు మరణం
✒ 2016: పౌరహక్కుల నేత బొజ్జా తారకం మరణం
✒ 2019: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం
✒ అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం