News March 20, 2024

పవన్ కళ్యాణ్‌పై MLA ద్వారంపూడి విమర్శలు

image

పవన్ కళ్యాణ్‌పై MLA ద్వారంపూడి పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన MLA గా పోటీ చేయాలంటే చంద్రబాబు,MPగా పోటీ చేయాలంటే అమిత్ షా అనుమతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అయి ఉండి కూడా ఇటువంటి స్థితిలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. పిఠాపురంలో కాపు సమాజిక వర్గం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌పై ప్రజలకు విశ్వాసం లేదని విమర్శించారు.

Similar News

News July 9, 2025

తూ.గో జిల్లాలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్

image

రాజమండ్రి జిల్లా ఎస్పీ డి.నరసింహ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.

News July 8, 2025

ధవలేశ్వరంలో 11 కిలోల గంజాయి స్వాధీనం

image

ధవళేశ్వరంలో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ టి.గణేశ్ తెలిపారు. కడియం సీఐ వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్ఐ హరిబాబు, ఈగల్ టీమ్‌తో కలిసి పీవీఆర్ పీ లేఅవుట్‌లో దాడి చేసి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వెల్లడించారు.

News July 8, 2025

తూ.గో: రేపు దేశవ్యాప్త సమ్మె

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని గోపాలపురం ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సమ్మె పత్రాలను వైద్యులకు అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.