News February 13, 2025
19న BRS విస్తృతస్థాయి సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736617762335_1226-normal-WIFI.webp)
TG: ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని KCR నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై KCR అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు.
Similar News
News February 14, 2025
IPLలో తొలి మ్యాచ్ ఎప్పుడు, ఎవరి మధ్య..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739465718378_1045-normal-WIFI.webp)
ఈ ఏడాది IPL షెడ్యూల్కు సంబంధించిన కీలక వివరాలను క్రిక్బజ్ వెబ్సైట్ వెల్లడించింది. ‘బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో మార్చి 22న(శనివారం) కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. గత ఏడాది రన్నరప్ టీమ్ సన్రైజర్స్ తర్వాతి రోజు మధ్యాహ్నం ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్ మీద తలపడనుంది. ఇక మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది’ అని పేర్కొంది.
News February 14, 2025
ఎల్లుండి OTTలోకి కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739460834881_695-normal-WIFI.webp)
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ మూవీ ‘మ్యాక్స్’ ఈ నెల 15న ఓటీటీలోకి రానుంది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించి సర్ఫ్రైజ్ ఇచ్చింది. అదే రోజు రాత్రి 7.30కు జీ కన్నడ ఛానల్లో ప్రసారం చేస్తామని పేర్కొంది. DEC 25న విడుదలై ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది.
News February 13, 2025
పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737944091889_1045-normal-WIFI.webp)
AP: తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని CM చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు, RTCలకు కేటాయించేవారు. వీటిని బ్లాక్లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో TTD రద్దు చేసింది. ఇప్పుడు పూర్తిగా AP పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది.