News February 13, 2025

రాజాపేట: ఉరేసుకొని యువకుడి సూసైడ్

image

ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రాజాపేట మండలంలో జరిగింది. SI అనిల్ కుమార్ తెలిపిన వివరాలు.. రఘునాథపురానికి చెందిన బిట్ల రమేశ్ పెద్ద కుమారుడు పవన్(25) గురువారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఘటనాస్థలానిక చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 14, 2025

మస్క్‌తో ఈ అంశాలపైనే చర్చించా: PM మోదీ

image

USలో పర్యటనలో ఉన్న PM మోదీ ఎలాన్ మస్క్‌తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్‌జ్, వివేక్ రామస్వామితోనూ PM చర్చలు జరిపారు.

News February 14, 2025

MBNR: హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 

image

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. గోపి గురించి మెడికల్ ఆఫీసర్‌‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లేబర్ రూమ్‌‌ను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్న తల్లి బిడ్డలను పరామర్శించారు.

News February 14, 2025

సిరిసిల్ల: నిర్వహణ పారదర్శకంగా నిర్వర్తించాలి: శేషాద్రి

image

ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పారదర్శకంగా నిర్వర్తించాలని డీపీవో, నోడల్ అధికారి శేషాద్రి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన హ్యాండ్ బుక్కులు చదువుకొని సజావుగా ఎన్నికల జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

error: Content is protected !!