News February 13, 2025

వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 8, 2025

సిరిసిల్ల: ఆటో- బైక్ ఢీ.. పలువురికి తీవ్రగాయాలు

image

సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక- జగ్గారావుపల్లి గ్రామాల మధ్య రోడ్డుప్రమాదం జరిగింది. కొదురుపాక నుంచి ప్రయాణికులతో జగ్గారావుపల్లి వైపు వస్తున్న ఆటోను రాంగ్ రూట్లో వచ్చిన బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆటో బోల్తా పడగా.. మద్యం మత్తులో ఉన్న బైకర్‌తో పాటు ఆటోలోని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News November 8, 2025

దొంగ-పోలీస్ గేమ్ ఆడుదామని అత్తను చంపేసింది!

image

AP: దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను కోడలు చంపేసిన ఘటన విశాఖ(D) పెందుర్తిలో జరిగింది. మహాలక్ష్మీ(63), ఆమె కోడలు లలిత మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న కోడలు దొంగ-పోలీస్ ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలతో పాటు కాళ్లు, చేతులు కట్టేసింది. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని చనిపోయినట్లు PSకు సమాచారం అందించింది. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.

News November 8, 2025

మెదక్: ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

చర్చ్ అఫ్ సౌత్ ఇండియా మెదక్ కేథడ్రల్ పాస్టరేట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 20 మంది సభ్యుల ఎన్నిక కోసం మొత్తం 60 మంది అభ్యర్థులు(జీఎస్‌పీ, పాస్‌నేట్, ఆల్ఫా ఒమేగా ప్యానెల్‌ల తరపున) పోటీపడ్డారు. 1712 మంది సభ్యులుండగా 1451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.75% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు ఫలితాలు రానున్నాయి. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.