News February 13, 2025
కామారెడ్డి: వాలంటైన్స్డే బజరంగ్దళ్, వీహెచ్పీ హెచ్చరిక

కామారెడ్డి జిల్లాలో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా భజరంగ్దళ్, వీహెచ్పీ కార్యకర్తలు కీలక ప్రకటన చేశారు. పాశ్చాత్య దేశాల సంప్రదాయాలు ప్రభావం మనదేశంలో పడకుండా చూడాలని కోరారు. ప్రేమ ముసుగులో వికృత చేష్టలు చేపడుతున్న యువతకు కళ్ళు తెరిపించి మంచి బుద్ధితో ఉండాలని సూచించారు. దేశ సేవకు ముందుకు రావాలని కోరారు. యువత, స్టూడెంట్ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టడానికి వీలుండదని హెచ్చరించారు.
Similar News
News November 7, 2025
వనపర్తి: ‘బీజీలు సమర్పించిన మిల్లులకే ధాన్యం కేటాయింపు’

ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు (బీజీ) సమర్పించిన రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. అర్హత సాధించిన 80 మిల్లుల్లో కేవలం 18 మిల్లులు మాత్రమే బీజీలు సమర్పించాయని, మిగతా అర్హతగల మిల్లులన్నీ వెంటనే బీజీలు సమర్పించాలని ఆదేశించారు.
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.
News November 7, 2025
కాగజ్నగర్: ఎస్ఎఫ్ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కుమురం భీం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సుంకరి సాయి క్రిష్ణ, వసాకే సాయికుమార్లు ఎన్నికయ్యారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రూ. 8,600 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజులు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


