News February 13, 2025

మహబూబాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వల్లబు వెంకటేశ్వర్లు

image

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కేసముద్రం పట్టణానికి చెందిన వల్లభు వెంకటేశ్వర్లును ఎన్నుకున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ, అనుబంధ సంస్థలలో పనిచేసిన ఆయన సుదీర్ఘ అనుభవంతో పార్టీని బలోపేతం చేసినందుకు గాను వెంకటేశ్వర్లును నియమించినట్లు తెలిపారు.

Similar News

News November 9, 2025

ఏలూరులో జాతీయ న్యాయ సేవా దినోత్సవం

image

జాతీయ న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఏలూరు కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలోని 39ఏ అధికరణం ప్రకారం, దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండాలని, ఆర్థిక లేదా ఇతర బలహీనతల కారణంగా ఎవరికీ న్యాయం అందకుండా పోకూడదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

News November 9, 2025

త్వరలోనే ఏనుగుల సమస్యలకు పరిష్కారం: పవన్

image

ఏనుగుల గుంపుతో కన్నా ఒంటరి ఏనుగుతోనే ఎక్కువ ప్రమాదమని MLA అమర్‌నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన Dy.CM పవన్‌తో కలిసి పలమనేరులోని కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు ‘ఏనుగులతో సమస్యలు వాటి పరిష్కార మార్గాలను’ వివరించారు. కుంకీ ఏనుగులతో ఒంటరి ఏనుగులకు చెక్ పెట్టవచ్చని, దీనికి సాంకేతిక తోడైతే మరింత ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, DFO పాల్గొన్నారు.

News November 9, 2025

HYD: KTRను చెత్తకుండికి కట్టేయండి: CM రేవంత్

image

జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ‘చెత్త’ చుట్టూ రాజకీయం ఆగడం లేదు. తాజాగా CM రేవంత్ KTRకు కౌంటర్ వేశారు. ‘ఆడ చెత్త ఉంది.. ఈడ చెత్త ఉంది అంటున్నారు. 3 సార్లు BRS MLA ఉండు. మున్సిపల్ మిన్సిస్టర్ KTR, MPగా కిషన్ రెడ్డి ఉండు. ఇన్నేళ్లు ఏం చేశారు? తోడు దొంగలు మీరే. మా ప్రాతినిథ్యం లేని చోట జవాబు చెప్పమనడం ఏంటి?. చెత్తకుండిని చూసి KTRను అక్కడ కట్టేయండి. ఆయనకు తత్వం అయినా బోధపడుతది’ అంటూ CM వ్యాఖ్యానించారు.