News February 13, 2025
మధురైలో పవన్ను కలిసిన OG సినిమాటోగ్రాఫర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739462301743_695-normal-WIFI.webp)
తమిళనాడులో పర్యటిస్తున్న Dy.CM పవన్ కళ్యాణ్ను మధురైలో ‘OG’ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు అకీరా నందన్ను పవర్ స్టార్ పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా OG చిత్రాన్ని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.
Similar News
News February 14, 2025
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739469217144_893-normal-WIFI.webp)
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటలపాటు వాదనలు జరిగాయి. A1 వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
News February 14, 2025
వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739476900447_893-normal-WIFI.webp)
AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.
News February 14, 2025
రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738218607309_893-normal-WIFI.webp)
ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.