News February 13, 2025
ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు: విష్ణు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739438307785_695-normal-WIFI.webp)
‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.
Similar News
News February 14, 2025
WPL-2025కు వేళాయె.. నేడే తొలి మ్యాచ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739484030479_893-normal-WIFI.webp)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. నేడు తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. వడోదర వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు. 5 జట్లు పాల్గొనే ఈ టీ20 లీగ్ 2023లో ప్రారంభమైంది. తొలి సీజన్లో ముంబై ఇండియన్స్, రెండో సీజన్లో RCB విజేతలుగా నిలిచాయి.
News February 14, 2025
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739469217144_893-normal-WIFI.webp)
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటలపాటు వాదనలు జరిగాయి. A1 వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
News February 14, 2025
వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739476900447_893-normal-WIFI.webp)
AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.