News February 14, 2025

గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తూ భారతీయుడి మృతి

image

భారత్‌లోని మీరట్‌కు చెందిన మోహిత్ కోహ్లీ అనే సైక్లిస్ట్ చిలీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 10వేల కి.మీ దూరాన్ని సైకిల్‌పై అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని భావించిన ఆయన దక్షిణ అమెరికాలో కొలంబియా నుంచి అర్జెంటీనాకు సైకిల్‌పై బయలుదేరారు. కొలంబియా, పెరూ, ఈక్వెడార్ దాటిన ఆయన చిలీలో ఓ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ వార్తతో మీరట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 19, 2025

భారీ బడ్జెట్‌గా చిరు-రావిపూడి మూవీ?

image

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే మూవీకి బడ్జెట్ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్లకే రూ.100 కోట్ల పైచిలుకు అవుతోందని, చిత్రీకరణ ఖర్చును కలుపుకొని బడ్జెట్ రూ.200 కోట్లు దాటేయొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మంచి టాక్ వస్తే ఆ మొత్తాన్ని రికవర్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చని పేర్కొన్నాయి. కాగా ‘విశ్వంభర’ సైతం ఇంచుమించు ఇదే బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.

News February 19, 2025

కుంభమేళాలో కిషన్ రెడ్డి కుటుంబం

image

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పవిత్రస్నానం ఆచరించారు. మంగళవారం సాయంత్రం భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఆయన త్రివేణీ సంగమానికి చేరుకున్నారు. సనాతన ధర్మంపై రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకు కుంభమేళాకు తరలివస్తున్న భక్తజనమే నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. త్రివేణీ సంగమంలో స్నానం చేయడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.

News February 19, 2025

నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ

image

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ నేటి నుంచే మొదలుకానుంది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లా, న్యూజిలాండ్, పాక్ ఉండగా గ్రూప్-బిలో అఫ్గాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. ఇరు గ్రూపుల్లోని తొలి రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి. భారత్ తొలిమ్యాచ్ రేపు బంగ్లాతో ఆడనుంది.

error: Content is protected !!