News February 14, 2025
సిరిసిల్ల: నిర్వహణ పారదర్శకంగా నిర్వర్తించాలి: శేషాద్రి

ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పారదర్శకంగా నిర్వర్తించాలని డీపీవో, నోడల్ అధికారి శేషాద్రి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన హ్యాండ్ బుక్కులు చదువుకొని సజావుగా ఎన్నికల జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
RBI సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం: సంజయ్

రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, విధానపరమైన నిర్ణయాలే దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. RBI చేపట్టిన సంస్కరణల వల్లే 2018లో నష్టాల్లో ఉన్న SBI ఇప్పుడు 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరిందన్నారు. 27గా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను 12కి తగ్గించడం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి కారణమని SBI బ్యాంకింగ్, ఎకనమిక్స్ కాన్క్లేవ్-2025లో అన్నారు.
News November 7, 2025
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి: కలెక్టర్

నక్కపల్లి మండలం పెదబోదిగల్లంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేలా సహకరించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో వీవీ రమణ, తహశీల్దార్ నర్సింహమూర్తి, డీఎల్ పురం, చందనాడ, మూలపర్రకు చెందిన కొందరితో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణణానికి కొంత సమయం కావాలని, భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు.
News November 7, 2025
అన్నవరం దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శుక్రవారం నిత్య కల్యాణ మండపంలో నిర్వహించారు. 30 రోజులకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా ఆలయానికి రూ.1 కోటి 73 లక్షల 37 వేల ఆదాయం లభించింది. భక్తులు 37 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సమర్పించారని ఈఓ సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రోహిత్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


