News February 14, 2025

ఉప్పునుంతల: 21తేది నుంచి వెల్టుర్‌లో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు

image

ఉప్పునుంతల మండలంలోని వెల్టుర్ గ్రామంలో ఈనెల 21తేది నుంచి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నర్సయ్య, దుర్గయ్య, బాల్ చంద్రి, నిరంజన్, లక్ష్మయ్య తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 25తేదీన అమ్మవారి కళ్యాణం, 26 తేదీన బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరారు. 

Similar News

News February 21, 2025

బాపట్ల: ‘పరీక్షలను సజావుగా నిర్వహించాలి’ 

image

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, పి 4 సర్వే, ఎం.ఎస్.ఎం.ఇ సర్వే, వాట్సాప్ గవర్నెన్స్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా వెంకట మురళీ పాల్గొన్నారు.

News February 21, 2025

ADB: జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు కీలకం: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో టీఎన్జీవో నూతన జిల్లా డైరీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి‌తోపాటు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు సమష్టిగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉంచాలని పేర్కొన్నారు.

News February 21, 2025

జగిత్యాల: నేరం చేస్తే శిక్ష తప్పదు: ఎస్పీ

image

జిల్లాలోని గడిచిన రెండు నెలల్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 14 మందికి జైలు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పీపీలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించి ప్రశాంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతటి వారైనా నేరం చేస్తే శిక్ష తప్పదని అన్నారు. నేరస్థులకు శిక్ష పడేలా చేయడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకరావచ్చన్నారు.

error: Content is protected !!