News March 20, 2024
వారిపై ఆ ప్రభావం ఒక శాతం కూడా ఉండదు: మెక్ గ్రాత్
ఐపీఎల్ వేలంలో ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. కమిన్స్కు సన్రైజర్స్ రూ.20.5 కోట్లు ఇస్తుంటే స్టార్క్కు కేకేఆర్ రూ.24.75 కోట్లు ఇవ్వనుంది. అయితే వారిపై ఆ ఒత్తిడి ఉండదని ఆసీస్ మాజీ బౌలర్ మెక్గ్రాత్ అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ చాలా అనుభవజ్ఞులు. ధరతో సంబంధం లేకుండా గతంలో ఎలా ఆడారో అలాగే ఆడతారు. వారిపై ఒకశాతం కూడా ఒత్తిడి ఉండదు’ అని పేర్కొన్నారు.
Similar News
News October 1, 2024
డిస్కౌంట్స్కు ముందు ధరల పెంపు.. రంగంలోకి AUS ప్రధాని
భారీ డిస్కౌంట్ల పేరుతో చేస్తోన్న స్కామ్ను నివారించేందుకు ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రంగంలోకి దిగారు. అక్కడి సూపర్ మార్కెట్స్ డిస్కౌంట్స్ ఇచ్చేముందు ప్రొడక్ట్ లేబుల్స్ను మార్చేస్తున్నాయని వాచ్డాగ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంథోనీ తన తోటి పార్లమెంట్ సభ్యురాలు మేరీ డోయల్తో పాటు మరికొందరితో చర్చించినట్లు ట్వీట్ చేశారు. సాధ్యమైనంత తక్కువ ధరకు వస్తువులు అందేలా కృషి చేస్తామన్నారు.
News October 1, 2024
3న ఓటీటీలోకి ‘ది గోట్’ మూవీ
వెంకట్ ప్రభు డైరెక్షన్లో దళపతి విజయ్ నటించిన ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీ ఈ నెల 3న ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 5న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.
News October 1, 2024
రాహుల్గాంధీ సిటిజన్షిప్ PIL: టైమ్ కావాలన్న కేంద్రం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం రద్దుపై తమకు అభ్యర్థన అందిందని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై చర్యలు తీసుకొనేందుకు కాస్త సమయం కావాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్కు తెలిపింది. రాహుల్కు బ్రిటన్ పౌరసత్వం ఎలా వచ్చిందో, తర్వాత ఆ డాక్యుమెంటును ఎందుకు క్యాన్సిల్ చేశారో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కర్ణాటక బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ హైకోర్టులో వేసిన పిల్కు వివరణ ఇచ్చింది.