News February 14, 2025
కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

పొన్నం ప్రభాకర్పై పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Similar News
News November 13, 2025
నేడు దానధర్మాలు చేస్తే..?

గురువారం చాలామంది సాయిబాబాను పూజిస్తారు. అయితే ఆయన పూజతో పాటు నేడు దానధర్మాలు చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందంటున్నారు. దానాలు చేస్తే సంపద పెరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. ఇలా 9 వారాలు చేసి, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటే వృత్తి-వ్యాపారాలలో పురోగతి ఉంటుందని, కుటుంబంలో శాంతి లభిస్తుందని నమ్మకం.
News November 13, 2025
HYD: గెట్ రెడీ.. రేపే కౌంటింగ్

రేపు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్పేటలోని 1వ బూత్తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది.
News November 13, 2025
గ్రేట్.. రాష్ట్రంలోనే నల్గొండకు రెండో స్థానం

జల్ సంచయ్ – జల్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 18న రాష్ట్రపతి చేతుల మీదుగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి అవార్డులో పాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. అయితే జల సంరక్షణ కోసం తిరుమలగిరి సాగర్ (M)లో అత్యధికంగా 3,678 పనులు చేపట్టగా, నాంపల్లి (M)లో 3,628 పనులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 84,827 పనులు చేపట్టారు.


