News March 20, 2024

ఎన్నికల తర్వాత పెరగనున్న విదేశీ పెట్టుబడులు!

image

భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు ఎన్నికల తర్వాత మరింత పెరుగుతుందని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. భారత్ ఆర్థికవృద్ధి కొనసాగుతుండటం, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ రంగంలోనూ ఈ విదేశీ పెట్టుబడుల హవా కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఈ రంగంలో ఇంటర్నేషనల్ ఫండ్స్ 1.70% లాభాన్ని నమోదు చేశాయి.

Similar News

News September 9, 2025

ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటీస్‌లు

image

DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌-చాందీపూర్‌‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://drdo.gov.in/

News September 9, 2025

రేపటి నుంచే పీఈసెట్ కౌన్సెలింగ్

image

AP PECET(వ్యాయామ విద్య) కౌన్సెలింగ్ రేపటినుంచి జరగనుంది. విద్యార్థులు ఈ నెల 13వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 11 నుంచి 14వరకు, కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదు 14నుంచి 16వరకు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎడిట్ ఈ నెల 17న అవకాశం ఇచ్చారు. ఈ నెల 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

News September 9, 2025

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 95 పోస్టులు

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 95 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లైకి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.