News February 14, 2025
సిద్దిపేట: పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ఘటనకు 11 ఏళ్లు

పొన్నం ప్రభాకర్పై పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం పొన్నం HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Similar News
News February 24, 2026
తాడిపత్రిలో కారు బీభత్సం.. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్

తాడిపత్రి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో ట్రాక్టర్ను కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ భాగాలు రెండుగా విడిపోయాయి. కారుకు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 24, 2026
సిరిసిల్ల: స్కూలు వాహనాలపై రవాణాశాఖ నిఘా.. 15 సీజ్

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాల బస్సులు, ఆటోలపై రవాణాశాఖ అధికారులు మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. డీటీవో లక్ష్మణ్ ఆదేశాల మేరకు వేములవాడ, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, తంగళ్లపల్లి మండలాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని 15 వాహనాలను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫిట్నెస్ లేని వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News February 24, 2026
విజయవాడలో బాలుడిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

విజయవాడ వన్ టౌన్ పరిధి వాగు సెంటర్ వద్ద బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు రాచకొండ రుషి (9) ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. అతణ్ని GGHకి తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యాలని సూచించారు. నగరంలో రోజు రోజుకి కుక్క కాట్లు అధికమవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


