News March 20, 2024

ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బయట వ్యక్తులు గుంపుగా ఉండడంపై విద్యాశాఖ, పోలీస్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News December 28, 2025

2025లో కడప జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవే.!

image

☛ ఉద్రిక్తతల నడుమ గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నికలో YCP విజయం
☛ పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో TDP విజయం
☛ కూటమి నేతలకు పదవులు
☛ కడప మేయర్‌గా సురేశ్ బాబు తొలగింపు.. తర్వాతి ఎన్నికలో పాక సురేశ్ ఎన్నిక
☛ కడప జిల్లా TDP అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియామకం
☛ కడప జిల్లాలో మహానాడు నిర్వహణ
☛ జమ్మలమడుగు YCP ఇన్‌ఛార్జ్‌గా రామసుబ్బారెడ్డి నియామకం
☛ ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిలపై దీక్షలు.

News December 27, 2025

ప్రొద్దుటూరు: నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,400
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,248
* వెండి 10 గ్రాములు ధర రూ.2,530

News December 27, 2025

కడప: ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు నోటీసులు.!

image

జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫేజ్ -3 ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వారు లబ్ధిదారుల నుంచి, ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా వదిలేశారు. దీనిపై అధికారులు పరిశీలన జరిపి సంబంధిత సిబ్బందికి జీతాలు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారు. వ్యతిరేకత రావడంతో కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చారు.