News February 14, 2025
మహబూబ్నగర్ RTC బస్సుకు రోడ్డు ప్రమాదం

మహబూబ్నగర్ డిపోకు చెందిన బస్సుకు షాద్నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులోని పోచమ్మ ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 12, 2025
MBNR: PHD ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి.!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సులకు సంబంధించిన PHD ప్రవేశ ఫలితాలను మంగళవారం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విడుదల చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 17 నుంచి 20 వరకు ఆయా కోర్సులలో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇది రాసిన ఉమ్మడి పాలమూరు వాసులు రిజల్ట్స్ http://www.teluguuniversity.ac.in వెబ్సైట్లో చూడొచ్చన్నారు.
News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
News March 12, 2025
MBNR: తెలంగాణ బడ్జెట్.. పాలమూరుకి ఏమి కావాలంటే.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయాయి. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సాగునీటి సరఫరా, దీర్ఘకాల సమస్యలు, గ్రామాల్లో హెల్త్ సెంటర్లు, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.