News March 20, 2024
నరసరావుపేట టీడీపీ టికెట్పై రగడ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710923823820-normal-WIFI.webp)
నరసరావుపేట TDPలో టికెట్ రగడ కొనసాగుతోంది. నేడు అధిష్ఠానం మూడో జాబితా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో YCP నేత జంగా కృష్ణమూర్తిని TDPలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నరసరావుపేటలో ఎప్పటి నుంచో పార్టీని కాపాడుతున్న అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ రామిరెడ్డి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
Similar News
News July 8, 2024
మాచర్ల: రోడ్డు ప్రమాదంలో పర్యాటకశాఖ ఉద్యోగి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421017627-normal-WIFI.webp)
మాచర్ల మండలం ఏకనాంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటక శాఖ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రామారావు(45) బైక్ మీద వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఆయన మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News July 8, 2024
గుంటూరు: ఇసుకపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఇదే.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720408430530-normal-WIFI.webp)
జిల్లాలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. కొల్లిపర, మున్నంగి, గుండిమెడ, తాళ్లాయపాలెం, లింగాయపాలెంలో ఇసుక నిల్వలు ఉండగా.. టన్ను ధర రూ.250గా నిర్ణయించారు. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసి ఇసుక పొందవచ్చని జిల్లా అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 0863-2234301కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
News July 8, 2024
నేటి నుంచి పిన్నెల్లి విచారణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720399962744-normal-WIFI.webp)
మాచర్ల YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజు పాల్వాయిగేట్లో ఈవీఎం ధ్వంసం, TDP ఏజెంట్ శేషగిరిరావుపై దాడి, కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి ఆయన్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు (8, 9 తేదీల్లో) నెల్లూరు జైలులోనే ఆయన విచారణ జరగనుంది. విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.