News February 14, 2025

ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

image

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

Similar News

News July 5, 2025

KNR: రేపు జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్స్

image

సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్‌లో జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం నిర్వహించనునట్లు జిల్లా హాకి జాయింట్ సెక్రటరీ తిరున హరి శ్రీనివాస్ తెలిపారు. ఈ హాకీ ట్రయల్స్ కోసం ఆసక్తి గల జిల్లాలోని హాకీ క్రీడాకారులు తమ పేర్లను జిల్లా ఇన్ఛార్జి సెక్రటరీ అలీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 7075667465, 9949029440 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News July 5, 2025

తాండవ జలాశయం నుంచి సాగు నీరు అందజేత..!

image

తాండవ జలాశయం కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో 51,465 ఎకరాలకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ అనురాధ తెలిపారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలో 25,440 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 7,385 ఎకరాలకు, కుడి ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలో 7,249 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 11,391 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.

News July 5, 2025

25 కుటుంబాలను దత్తత తీసుకున్న దగ్గుపాటి అశ్రిత

image

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె దగ్గుపాటి అశ్రిత పీ4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. దగ్గుపాటి ఫౌండేషన్ తరఫున 25 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ తొలి సమావేశంలో ఎమ్మెల్యే ఈ ప్రకటన చేశారు. దగ్గుపాటి అశ్రితను అధికారులు, పీ4 టీం సభ్యులు అభినందించారు.