News February 14, 2025

బిజినేపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ(55) బుధవారం రాత్రి భర్త సుల్తాన్ పొలానికి వెళ్లగా ఒంటరిగా పడుకుంది. ఉదయం భర్త ఇంటికి వచ్చిన సమయంలో ఆమె గాయాలతో ఉంది. వెంటనే నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బిజినేపల్లి ఎస్ఐ తెలిపారు.

Similar News

News September 13, 2025

ప్రకాశం జిల్లా నూతన SP నేపథ్యం ఇదే.!

image

ప్రకాశం జిల్లాకు <<17699232>>SPగా వి హర్షవర్ధన్ రాజు<<>> నియమితులైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈయన అనంతపురం JNTUలో బీ.టెక్ పూర్తి చేశారు. 2013లో రాష్ట్ర పోలీసు సేవల్లో చేరారు. విజయవాడలో DCP, అన్నమయ్య, కడప జిల్లాల SP, విజయవాడలో CID SP, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ.. ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు.

News September 13, 2025

ఒంటరిగా ఉండకండి.. ఇది ప్రమాదకరం!

image

ప్రస్తుతం ఒంటరితనం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఉంటూ సమాజానికి దూరం కావడం, ఆర్థిక పరిస్థితులు, పట్టణీకరణ వంటి కారణాలతో ఒంటరితనం పెరిగినట్లు WHO పేర్కొంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, గుండె జబ్బులు, డిప్రెషన్‌ వంటి ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8,71,000 మందికిపైగా చనిపోతున్నట్లు వెల్లడించింది. అంటే ఒంటరితనం వల్ల గంటకు 100 మంది చనిపోతున్నారన్నమాట.

News September 13, 2025

NRPT: ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి, ఎమ్మెల్యే

image

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచారని శనివారం హైద్రాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎకరాకు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భూ సేకరణ పనులు వేగంగా చేపడుతామని చెప్పారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఉన్నారు.