News February 14, 2025
NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.
Similar News
News January 16, 2026
రేపు మేడారం ట్రస్ట్ బోర్డు ఛైర్పర్సన్ ప్రమాణస్వీకారం

మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్పర్సన్గా తాడ్వాయి మండలానికి చెందిన ఈర్పా సుకన్యను ప్రభుత్వం నామినేట్ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు మేడారంలోని సమ్మక్క భవన్లో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 16, 2026
జగిత్యాల కలెక్టరేట్లో విద్యా ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల సమీకృత కలెక్టరేట్లో TGMREIS ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ టి. సుచిత్ర పాల్గొని, అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 16, 2026
కౌన్సిలింగ్ కోసం AP RCET అభ్యర్థుల ఎదురుచూపులు

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో PhD ప్రవేశాల కోసం గత ఏడాది నవంబర్లో తిరుపతి SPWU ఆధ్వర్యంలో AP RCET పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 15న ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కౌన్సిలింగ్ తేదీలు ఎప్పుడు వస్తాయేమో అని అర్హత సాధించిన అభ్యర్థులకు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి AP RCET కౌన్సిలింగ్, అడ్మిషన్లు చేపట్టాలని కోరుతున్నారు.


