News February 14, 2025
ఎమ్మెల్యే వేముల వీరేశం LOVE STORY మీకు తెలుసా..?

FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. నకిరేకల్ MLA వీరేశం, పుష్ప దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేసే సమయంలో ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే కావడంతో కలిసి బతకాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగినవి కావడంతో పెద్దల అంగీకారంతో ఆనాడు వారు పనిచేస్తున్న ఉద్యమ సంస్థే వీరి పెళ్లి జరిపించింది.
Similar News
News November 10, 2025
యాదాద్రి: మధ్యాహ్న భోజనం తనిఖీ చేయనున్న అధికారులు

ఈనెల 11, 13న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎంపిక చేసిన అధికారులచే మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను, మూత్రశాలలను పర్యవేక్షించాలని సూచించారు. పర్యవేక్షించిన అంశాలను చెక్ లిస్ట్ రూపంలో నమోదు చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు.
News November 10, 2025
శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యితో రూ. 251 కోట్ల దోపిడి: పట్టాభి

ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని TDP నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. YCP హయాంలో TTD ఛైర్మన్లుగా పనిచేసిన జగన్ బంధువులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. YV సుబ్బారెడ్డి హయాంలో ‘భోలే బాబా’ కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ. 251 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అంతేకాకుండా పామాయిల్ పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్నారు.
News November 10, 2025
VKB: ధాన్యం సరైన విధంగా కొనుగోలు చేయాలి: కలెక్టర్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం పత్తి కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.


