News February 14, 2025
ఏపీలో జీబీఎస్ కేసులు.. ప్రభుత్వం అలర్ట్

APలో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్లోనే ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆస్పత్రిని సందర్శించారు. జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్కు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.
Similar News
News November 5, 2025
ఎన్టీఆర్ ఊర మాస్ లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయటకొచ్చిన ఫొటోలు వైరలవుతున్నాయి. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ తీస్తోన్న మూవీ షూట్లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా బరువు తగ్గడంపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ బియర్డ్ లుక్లో NTR హ్యాండ్సమ్గా ఉన్నారని, ‘డ్రాగన్’ మూవీ లుక్ ఇలానే ఉంటుందా? అంటూ పోస్టులు చేస్తున్నారు. తారక్ లుక్ ఎలా ఉంది? COMMENT
News November 5, 2025
సమాజ అవసరాలకు అనుగుణంగా విజన్: CBN

సమష్టి బాధ్యతతో అధికారులు, పారిశ్రామికవేత్తలు భవిష్యత్తరాలకు సరైన మార్గన్ని నిర్దేశించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. ప్రపంచం, సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు తమ విజన్ను రూపొందించుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తన సతీమణికి యూకే డిస్టింగ్విష్ ఫెలోషిప్-2025 అవార్డు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<


