News February 14, 2025
విజయవాడ: వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

వల్లభనేని వంశీ అరెస్ట్ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.
Similar News
News February 25, 2026
TODAY HEADLINES

*YCP హయాంలో హిందూమతంపై దాడి: CBN
*లడ్డూ తయారీలో 68L కిలోల కల్తీ నెయ్యి వాడారు: Dy.CM పవన్
*AP: దివ్యాంగులకు ఉచిత RTC బస్సు సౌకర్యం: క్యాబినెట్
*నేనూ కుల వివక్షను ఎదుర్కొన్నా: భట్టి
*పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవ్జీ.. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన
*TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. 5min లేటైనా అనుమతి
*కేరళను ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం
News February 25, 2026
ప్రజారోగ్య రక్షణలో ప్రభుత్వం విఫలం: జగన్

AP: శ్రీకాకుళం <<19230296>>డయేరియా<<>> ఘటనపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్, మురుగునీటి నిర్వహణలో తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
News February 25, 2026
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

కర్నూలు రూరల్ సర్కిల్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ లైబ్రేరియన్ పేరం భైరవి రోడ్డు దాటుతుండగా డోన్ వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భైరవి, బైక్ రైడర్ ఆవుల అరవింద్ తీవ్రంగా గాయపడ్డారు. GGHలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


