News February 14, 2025

అల్లాదుర్గం: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

అల్లాదుర్గం మండలం సీతానగర్ గ్రామ శివారులో రోడ్డు పక్క అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు కాగితంపల్లి గ్రామానికి చెందిన ముసిరిగారి మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. మల్లయ్య కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

Similar News

News November 8, 2025

రాత్రి బెడ్‌షీట్ కప్పి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా?

image

ఈమధ్య యువత పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్‌లో రీల్స్ ఫ్లిప్ చేస్తూనే జీవితం గడుపుతోంది. చీకట్లో కళ్లకు దగ్గరగా పెట్టుకుని ఫోన్ చూస్తే నరాలు, మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా లైట్స్ ఆఫ్ చేశాక, బెడ్ షీట్ కప్పుకుని స్క్రీన్‌కు అతుక్కుపోయారంటే మన కళ్లపై బ్లూ లైట్ నేరుగా పడుతుంది. దీంతో నిద్రలేమి, కంటి చూపు సమస్యలు వస్తాయి. ఫోన్ వాడండి. వ్యసనంగా మార్చుకోకండి.
Share It

News November 8, 2025

ఇడుపులపాడు చెరువులో 16 ఏళ్ల యువకుడు గల్లంతు

image

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన శనివారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడినప్పటికీ లైట్లు వేసి గాలిస్తున్నారు.

News November 8, 2025

సంతోష సాగరం… ముంబై మహానగరం

image

ముంబై అనగానే మనకు గజిబిజి జీవితాలు కళ్లముందు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఆసియాలోనే ఇతర నగరాలకు మించి ఎన్నో ఆనందానుభూతుల్ని అందించే ప్రాంతాల్లో నం.1గా నిలిచింది. ‘Time Out’s City Life Index-2025’ సర్వేలో ఇది వెల్లడైంది. సంస్కృతి, జీవన నాణ్యత, స్థానికుల ఆదరణ, ఉపాధి వంటి అంశాలపై సర్వే చేపట్టి సంస్థ విశ్లేషించింది. ఆసియాలోని బీజింగ్, షాంఘై, చాంగ్ మాయి, హనోయ్‌లను ముంబై బీట్ చేసింది.