News February 14, 2025
PPM: సంజీవయ్య ప్రేరణతో ముందుకు సాగాలి

దామోదరం సంజీవయ్య స్పూర్తి, ప్రేరణతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జయంతిని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలను వేసి నివాళులర్పించారు.
Similar News
News November 6, 2025
ఖతార్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖతార్లో సూపర్వైజర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, టెక్నికల్ సర్టిఫికెట్తో పాటు పని అనుభవం గలవారు ఇవాళ్టి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెలకు రూ.1,94,000 నుంచి రూ.2,38,000 వరకు చెల్లిస్తారు. వయసు 45ఏళ్ల లోపు ఉండాలి. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/
News November 6, 2025
వరంగల్ నిట్లో ఉచితంగా GATE కోచింగ్

వరంగల్ నిట్(NIT)లో ఎస్సీ-ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచితంగా GATE కోచింగ్ నిర్వహిస్తున్నట్లు సెల్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 2026 జనవరి 9 వరకు ఈ కోర్సు 8 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వివరాల కోసం ఎస్సీ-ఎస్టీ సెల్, నిట్ వరంగల్ను సంప్రదించాలని కోరారు.
News November 6, 2025
ఖమ్మం: పత్తి మిల్లుల నిరవధిక సమ్మె వాయిదా

తెలంగాణలోని కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, దీంతో నవంబర్ 6న జరగాల్సిన నిరవధిక బంద్ను వాయిదా వేస్తున్నట్లు టీజీ కాటన్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపై కేంద్రానికి లేఖ పంపినట్లు తెలిపింది. 2, 3 రోజుల్లో 75% మిల్లులు ప్రారంభమవుతాయని CCI బ్రాంచ్ మేనేజర్లు చెప్పడంతో.. కొనుగోలు కేంద్రాలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.


