News February 14, 2025

వికారాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వికారాబాద్‌లో ఇవాళ 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం చలి, మద్యాహ్నం ఎండతో ప్రజలు బయటికి రావడానికి జంపుతున్నారు. ఇవాళ వికారాబాద్‌లోని హైదరాబాద్ రోడ్డు నిర్మాణష్యంగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News February 27, 2026

‘కర్నూలు జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు’

image

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా అవసరాల కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 27, 2026

HYDలో మీటర్ల ‘మాయాజాలం’.. ₹450 కోట్ల SCAM..?

image

నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్‌లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ.450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. టెండర్ల నిబంధనలు మార్చి మరీ ‘ఫేవరెట్’ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక పెద్దల హస్తం ఉందన్నది కాదనలేని సత్యం. అసలు తిమింగలాలు వేరే ఉన్నాయి.

News February 27, 2026

జగిత్యాల: బెట్టింగ్ భూతం.. చెట్టుకు వేలాడిన దేహం

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. జగిత్యాల (R) మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గర్వందుల మహేశ్ (38) ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న మహేశ్ కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌ కారణంగా సుమారు రూ.25 లక్షలు నష్టపోయారు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.