News March 20, 2024
అయోధ్య రామయ్య సేవలో ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ జోనాస్తో కలిసి బాలరామయ్య సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామజన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆమె తొలిసారి దర్శించుకున్నారు.
Similar News
News September 9, 2025
ఉపరాష్ట్రపతి నిర్వహించే బాధ్యతలు ఇవే

భారత్లో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి. ఈ పదవిని చేపట్టిన వారు రాజ్యసభ ఛైర్మన్గా వ్యవహరిస్తూ సభ సజావుగా, గౌరవప్రదంగా సాగేలా చూస్తారు. సభలో తటస్థంగా ఉంటారు. వీరు బిల్లులపై ఓటేసేందుకు వీలుండదు. ఎప్పుడైనా టై అయితే మాత్రమే కాస్టింగ్ ఓటు వేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం ఏదైనా కారణంతో రాష్ట్రపతి సీటు ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా రాష్ట్రపతి విధులను చేపట్టవచ్చు.
News September 9, 2025
జగన్ను జైల్లో పెడతారా? లోకేశ్ సమాధానమిదే!

AP: రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘వైసీపీ హయాంలో చంద్రబాబును జైలులో పెట్టారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జగన్ను జైలుకు పంపుతారా?’ అని ఇండియా టుడే కాన్క్లేవ్లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘చేయాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసే వాళ్లం. కానీ మా దృష్టంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉంది. నేనైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అని పేర్కొన్నారు.
News September 9, 2025
నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ జరగనుంది. ఓటింగ్ ఉ.10 గంటలకు ప్రారంభమై సా.5 గంటలకు ముగుస్తుంది. సా.6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. లోక్సభ, రాజ్య సభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా, 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. NDA ఆ మార్క్ కంటే ఎక్కువ మంది సభ్యుల్ని (422) కలిగి ఉండటం గమనార్హం.