News February 14, 2025

ములుగు: సదరం స్లాట్ బుకింగ్‌కు అంతరాయం

image

ములుగు జిల్లాలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వారం రోజుల పాటు సదరం క్యాంపులను నిలిపివేయనున్నట్లు సంబంధిత జిల్లా అధికారులు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా యూడీఐడీ ద్వారా దివ్యాంగత నిర్ధారణ పరీక్షలు జరుపుటకు కార్యాచరణ జరగడంతో పాటు, ప్రస్తుతం సదరం ద్వారా అమలవుతున్న ఏడు రకాల దివ్యాంగత్వాల స్థానంలో మరో 14 సేవలను చేర్చి త్వరలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Similar News

News November 6, 2025

ఖమ్మం: స్కూటీ రిపేర్ చేయలేదని షో రూమ్‌కు తాళం

image

ఖమ్మంలో గురువారం వినూత్న ఘటన జరిగింది. తన ఎలక్ట్రికల్ స్కూటీని రిపేర్ చేయలేదన్న కారణంగా ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్‌కు తాళం వేశాడు. బోనకల్ మండలం రావినూతలకి చెందిన కొమ్మినేని సాయి కృష్ణ నాలుగు నెలల క్రితం స్కూటీ కొనుగోలు చేశారు. రిపేరు రావడంతో షోరూమ్ సిబ్బందిని సంప్రదించగా, అది తమ పరిధిలో రిపేరు కాదని వారు తెలిపారు. దీంతో అసహనానికి గురైన సాయి కృష్ణ ఆ షోరూమ్‌కు తాళం వేసినట్లు సమాచారం.

News November 6, 2025

GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

image

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్‌ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్‌ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

News November 6, 2025

స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌కు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స్పెష‌ల్ సమ్మ‌రీ రివిజ‌న్‌-ఎస్ఐఆర్‌) ప్ర‌క్రియ‌పై పూర్తిస్థాయి అవ‌గాహ‌న పెంపొందించుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాల‌ని క‌లెక్ట‌ర్ షాన్ మోహన్ అధికారుల‌కు సూచించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సీఈవో వివేక్ యాద‌వ్‌.. సచివాలయం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి ఆయన కాకినాడ తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు.