News February 14, 2025
రెవెన్యూ సదస్సుల అర్జీలను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్లో లేకుండా శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయి డివిజన్ స్థాయిలో ప్రతి సోమవారం అర్జీలను 100% ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు.
Similar News
News January 12, 2026
తిరుపతి: శిల్ప కళాశాల నిర్మాణం ప్రత్యేకం..!

అలిపిరి వద్ద టౌన్ షిప్ నిర్మించాలంటే శిల్ప కళాశాలను తొలగించాలనే వాదన నడుస్తోంది. 1960లో శిల్ప కళ అంతరించిపోకుండా ఉండేందుకు TTD దీన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థుల సౌకర్యాలు, విగ్రహాల తయారీ, వాటి ప్రదర్శన తదితర అవసరాలకు తగిన విధంగా ఏర్పాటు చేసింది. ఆభవనం తొలగించాలంటే ఆహంగులతో తిరిగి నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత నష్టం అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. TTD స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
News January 12, 2026
విజయ్పై సీబీఐ ప్రశ్నల వర్షం

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.
News January 12, 2026
సంక్రాంతి.. HYD దాటిన 7 లక్షల వాహనాలు

సంక్రాంతి వేళ HYD నుంచి స్వగ్రామాలకు జనం క్యూ కట్టారు. ఈ సారి 12 లక్షల వాహనాలు HYD దాటనున్నట్లు అంచనా వేయగా.. ఇప్పటికే సుమారు 7 లక్షల వాహనాలు HYD దాటినట్లు వివిధ శాఖల అధికారులు తెలిపారు. ప్రతి 20 కిలోమీటర్లకు అంబులెన్స్, ఆగిన వాహనాల తరలింపునకు క్రేన్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టోల్ గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి.


