News February 14, 2025

సిరిసిల్ల: నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణలో విద్యార్థులు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఈఈటీని ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలు, అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు వివరాలు తెలుస్తాయన్నారు.

Similar News

News November 9, 2025

నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

image

* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం
* 2009: నోబెల్ గ్రహీత హర‌గోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* జాతీయ న్యాయ సేవల దినోత్సవం

News November 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 9, 2025

జిల్లాలో 48,325 MTల ధాన్యం కొనుగోళ్లు పూర్తి

image

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకొని రైతులు మద్దతు ధర పొందాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ కోరారు. వేములవాడ పరిధిలోని బాలానగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 48,325 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 238 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.