News February 14, 2025

సంగారెడ్డి: కోటి రుద్రాక్ష మహోత్సవానికి కేంద్ర మంత్రికి ఆహ్వానం

image

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 26న సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో జరిగే కోటి రుద్రాక్ష మహోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి శుక్రవారం ఆహ్వాన పత్రిక అందజేశారు.1.08 కోట్ల రుద్రాక్షలతో 18.5 అడుగుల శివలింగాన్ని తయారు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 9, 2025

ములుగు జిల్లాలో మూగబోయిన మైకులు..!

image

జిల్లాలోని మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నేటితో ప్రచారం ముగిసింది. ఎన్నికల నియామవళి ప్రకారం నేటి సాయంత్రానికి ప్రచారం ముగియడంతో ఆయా పార్టీల ప్రచార రధాలు, మైకులు మూగబోయాయి. ఈనెల 11న జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలకు మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. అందుకు కావలసిన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా అధికారులు సిద్ధం చేశారు.

News December 9, 2025

భూసమస్యలకు ఇక JCలదే బాధ్యత: అనగాని

image

AP: జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘గత పాలకుల పాపాలను కడిగేందుకు కృషి చేయడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాం. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే జాయింట్ కలెక్టర్లు పనిచేయాలని CM స్పష్టం చేశారు. JCలు లేని జిల్లాలకు వెంటనే నియమించాలన్నారు. ఇకపై భూసమస్యలన్నింటికీ JCలదే బాధ్యత’ అని తెలిపారు.

News December 9, 2025

మరికొన్ని గంటల్లో బంద్.. నివారణకు ప్రభుత్వం చర్యలు

image

AP: అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో సరకు రవాణా లారీలు బంద్ పాటించనున్నాయి. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలతో రవాణాశాఖ కమిషనర్ కాసేపట్లో భేటీ కానున్నారు. బంద్‌ నిర్ణయాన్ని విరమించాలని కోరనుండగా, దీనిపై నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. 13-20ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ లారీ యజమానులు బంద్ చేయనున్నారు.