News February 14, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు షాక్

AUSతో జరిగిన రెండు వన్డేల సిరీస్ను శ్రీలంక 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో 174 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసింది. అంతకుముందు PAKతో జరిగిన ODI సిరీస్నూ ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో వరుసగా 4 మ్యాచ్లు ఓడినట్లయ్యింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ఫలితాలు ఆ జట్టుకు ఎదురుదెబ్బే. కీలక ఆటగాళ్లు కమిన్స్, హేజిల్ వుడ్, మార్ష్, స్టార్క్ కూడా CTకి దూరమైన విషయం తెలిసిందే.
Similar News
News January 12, 2026
చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

AP: జగన్ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్ అవుతుందా? జగన్ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.
News January 12, 2026
Q3 ఫలితాలు ప్రకటించిన TCS.. భారీగా డివిడెండ్

టీసీఎస్ Q3 ఫలితాలను ప్రకటించింది. FY 2025-26 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.10,657 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో(Q3-రూ.12,380) పోలిస్తే 14% నికరలాభం తగ్గినట్లు తెలిపింది. అయితే ఆదాయంలో మాత్రం 5శాతం వృద్ధితో రూ.67,087 కోట్లకు చేరింది. 11,151 మంది ఉద్యోగులు తగ్గిపోగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్పై రూ.57 చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.
News January 12, 2026
డీఏపై జీవో విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగుల <<18837053>>డీఏ 3.64%<<>> పెంచుతూ సర్కారు జీవో విడుదల చేసింది. 2023 జులై 1 నుంచి ఇది వర్తించనుంది. పెరిగిన డీఏ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు డీఏ బకాయిలు GPF ఖాతాలో జమ చేయనున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు అందరి జీతాలు పెరగనున్నాయి.


