News February 14, 2025
తంగళ్ళపల్లి: అధ్యాపకుడిగా మారిన కలెక్టర్

తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా మాథ్స్, బాటని పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించారు. పాఠ్యాంశాలలోని అనుమానాలను విద్యార్థులకు నివృత్తి చేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 6, 2025
చిలకలూరిపేట: మాజీ మంత్రి పీఏలపై కేసు నమోదు

ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి కొంతమంది వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజిని పీఏలైన రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, శ్రీగణేశ్, కుమారస్వామిలపై చిలకలూరిపేట రూరల్ PSలో కేసు నమోదు అయింది. గత సోమవారం పట్టణానికి చెందిన ఎస్ఎంఎస్ సుభాని, తన్నీరు వెంకటేశ్వర్లు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు.
News November 6, 2025
కౌడిపల్లి: కోళ్ల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన కొన్యాల దత్తయ్య(57) నడిచి వెళ్తుండగా.. రాంగ్రూట్లో వచ్చిన కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే దత్తయ్యను అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 6, 2025
నాగర్ కర్నూల్: ఈనెల 15న లోక్ అదాలత్

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో కేసుల పరిష్కారానికి ఈనెల 15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రెటరీ నసీమ సుల్తానా తెలిపారు. పోలీసు అధికారులు వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా చూడాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొందవచ్చన్నారు.


